వ్యాధి నిరోధక టీకాలపై తల్లులకు అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఉదయం కర్నూలు నగరంలోని బుధవారపేటలోని 36 వ సచివాలయంలొ జరుగుచున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమములో మాస్ మీడియా అధికారి ప్రకాష్ రాజ్ పాల్గొని తల్లులకు అవగాహనా కల్పించినారు,అనంతరం మాట్లాడుతూ 5 సంవత్సరముల నుండి 7 సంవత్సరములలోపు పిల్లలకు డి.పి.టి వ్యాక్సిన్ ధనుర్వాతం,కోరింతదగ్గు, కంఠ సర్పి, మరియు 10 సంవత్సరముల పిల్ల నుంచి 16 సంవత్సరముల వయస్సులోపు పిల్లలకు టి.డి వ్యాక్సిన్ ధనుర్వాతం,కంఠ సర్పివ్యాధులకు గురికాకుండా వేయించుకోవాలని,ముఖ్యంగా ధనుర్వాతం,కోరింతదగ్గు, కంట సర్పి ఈ మూడు వ్యాధులు బాక్టిరియం ద్వారా వస్తాయని మరియు ప్రమాదకరమైనవి పిల్లల్లో అనారోగ్య పరిస్థితులను,మరణాలను తగ్గించడానికి పిల్లలకు ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమములో డిప్యూటి హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పద్మావతి ,సచివాలయ కార్యకర్త పావని, ఆశా కార్యకర్త లక్ష్మి కాంత మరియు ప్రోజేక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.


