కూటమి సంక్షేమ పాలన సూపర్ సక్సెస్
1 min read
సూపర్ సిక్స్ పథకాలతో ఏపీలో నవ శకం
ఎమ్మెల్యే షాజహాన్ బాషా, టిడిపి జిల్లా అధ్యక్షులు సుగవాసి స్పష్టం
మదనపల్లె ఆగస్టు 10, న్యూస్ నేడు ప్రతినిధి : రాష్ట్రం లో కూటమి పాలన రాష్ట్ర ప్రజల మన్నన్నలు అందు కుంటోందని ,సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో సీఎం చంద్రబాబు ఏపీలో నవ శకానికి నాంది పలికారని మదన పల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగ వాసి ప్రసాద్ బాబులు అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకోవడం తో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని సోమవారం 14వ వార్డ్ పరిధిలో వార్డ్ ఇంఛార్జ్,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆఫ్ శీనా) ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా, జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు,నియోజకవర్గం అబ్జర్వర్ నెట్టెం వెంకటేష్ లు ముఖ్య అతి థులుగా హాజరు కాగా నాగూర్ వలి వారికి ఘన స్వాగతం పలికారు.ఈ కార్య క్రమంలో టౌన్ బ్యాంక్ ఛైర్మన్ నాదెళ్ల విద్యా సాగర్,పట్టణ అధ్యక్షులు నాదెళ్ల అరుణ్ తేజ (చింటూ),వెంకటేశ్వరస్వామి గుడి చైర్మన్ గంగారపు నవీన్ చౌదరి, గంగారపు రామ్మూర్తి నాయుడు, గాంధీ, పట్టణ మహిళా అధ్యక్షరాలు రాటకొండ భారతి,బాలు స్వామి,రాటకొండ మధు బాబు,నాదెళ్ల రమేష్,రామ్మూర్తి,వెంకటేష్,పెరవలి మధు,తాళ్ల గిరి,బాబు నాయుడు,పూల మురళి,సోమశేఖర్,శ్రీరామ్ వినోద్, శ్రీరామ నాగమణి, మహిళా నాయకురాలు బైగారి భారతి నాయుడు,రాధమ్మ,పులి మహాలక్ష్మి, విజయమ్మ కార్య కర్తలు పాల్గొన్నారు.


