టీబి డ్యాం నుంచి నీరు విడుదల చేయాలి: మండల కన్వీనర్ ప్రహ్లాదాచారి
1 min read
కౌతాళం ,న్యూస్ నేడు: మండల కేంద్రమైన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించగా మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి ఆదేశాల మేరకు, మంత్రాలయం తుంగభద్ర డ్యాం నుంచి నది దిగువ కాలువల పరిధిలోని రైతులకు తాగు- సాగునీటినీ వెంటనే విడుదల చేయాలని వైసిపి నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుత డ్యాం లో 89 టీఎంసీలు నీరు ఉన్న రైతులకు నీరు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. ఐ ఏ బి సమావేశం నిర్వహించి సకాలంలో నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో, మాబుసాబ్,ఏకం రెడ్డి.హల్వి బసవరాజ్ దని,బుజ్జి స్వామి, ఎమ్మెల్యే పిఏ వెంకట్రామిరెడ్డి, మాజీ సర్పంచులు అవతారం, పాల్ దినకర్, సక్రీ తిక్కయ్య.వడ్డే రాముడు,సమ్మద్, తదితరులు వైసిపి నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


