ఉత్తమ గ్రంథాలయ అధికారిగా దుగ్గిపోగు జాన్ బాబుకి ప్రశంసా పత్రం
1 min read
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సామాజికవేత్త, పెదపాడు గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబుకి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి,ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సమక్షంలో ఉత్తమ అధికారిగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఉత్తమ అధికారులకు బాధ్యతగా ప్రజలకు సేవలు అందించాలని మంత్రి అన్నారు.మిత్రులు శ్రేయోభిలాషులు,సహచర ఉద్యోగులు,జాన్ బాబుకి అభినందనలు తెలియజేశారు.


