NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పారాక్వాట్ విషప్రయోగానికి గురైన 10 ఏళ్ల బాలుడికి విజయవంతమైన చికిత్స

1 min read

– మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్‌

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రమాదవశాత్తు పారాక్వాట్ (Paraquat) సేవించిన 10 ఏళ్ల బాలుడికి మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్‌లో వైద్యులు సమయస్ఫూర్తితో అందించిన చికిత్సతో విజయవంతంగా కోలుకున్నాడు. తీవ్రమైన విషప్రయోగం కారణంగా కిడ్నీల పనితీరుపై ప్రభావం పడటంతో, నెఫ్రాలజీ నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం బాలుడి కిడ్నీ పనితీరు మెరుగుపడి, పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి 06 ఆగస్టు డిశ్చార్జ్ అయ్యాడు.10 ఏళ్ల బాలుడు జూలై 23, 2026 ఉదయం 6:30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు పారాక్వాట్ సేవించాడు. అనంతరం స్వల్పంగా వాంతులు రావడంతో ఉదయం 7:30 గంటలకు పులివెందులలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్‌కు తీసుకువచ్చారు.బాలుడిని పరీక్షించిన వైద్య బృందం పారాక్వాట్ విషప్రయోగంతో పాటు కిడ్నీ పనితీరులో తీవ్రమైన సమస్య, రక్తం గడ్డకట్టే ప్రక్రియలో మార్పులు ఉన్నట్లు గుర్తించింది. చికిత్సకు బాలుడు క్రమంగా స్పందించడంతో కిడ్నీ పనితీరు మెరుగుపడింది.ఈ సందర్భంగా డా. కె. సింధూర, పీడియాట్రిషియన్ & నియోనాటాలజిస్ట్, మాట్లాడుతూ, “పిల్లలు ప్రమాదవశాత్తు విషపదార్థాలను తీసుకునే సందర్భాల్లో ప్రతి నిమిషం ఎంతో కీలకం. వెంటనే వైద్య సహాయం అందించడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించే అవకాశం ఉంటుంది. ఈ బాలుడిని ప్రారంభ దశలోనే ఆసుపత్రికి తీసుకురావడం, అవసరమైన వైద్య చికిత్సను సకాలంలో అందించడం వల్ల కోలుకునే అవకాశం మెరుగుపడింది” అని తెలిపారు.నెఫ్రాలజిస్ట్ డా. సిద్ధార్థ్ హెరూర్ మాట్లాడుతూ, “పారాక్వాట్ విషప్రయోగం కిడ్నీలతో పాటు శరీరంలోని ఇతర అవయవాలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. చికిత్సకు బాలుడు క్రమంగా స్పందించడంతో కిడ్నీ పనితీరు మెరుగుపడి, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు” అని తెలిపారు.డా. భార్గవ వ్యాస్ ఏ.ఎన్., జనరల్ & లాపరోస్కోపిక్ సర్జన్ మాట్లాడుతూ, “విషపదార్థాల ప్రమాదవశాత్తు సేవనం వంటి అత్యవసర పరిస్థితుల్లో రోగిని ఆలస్యం చేయకుండా సమీపంలోని అత్యవసర వైద్య కేంద్రానికి తరలించడం చాలా ముఖ్యం. ఈ కేసులో వివిధ విభాగాల వైద్యులు సమన్వయంతో పనిచేయడం ద్వారా బాలుడికి అవసరమైన చికిత్సను అందించగలిగాం” అని తెలిపారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్ హెడ్  మహేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ “వైద్య బృందం సమన్వయంతో అందించిన అత్యవసర వైద్యం, నెఫ్రాలజీ పర్యవేక్షణ మరియు హీమోడయాలసిస్ చికిత్సతో బాలుడి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. అనంతరం బాలుడు పూర్తిగా కోలుకోవడంతో వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *