ప్యాపిలి సాయిబాబా ఆలయంలో మాజీ మంత్రి బుగ్గన ప్రత్యేక పూజలు
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్యాపిలి పట్టణంలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయిబాబా ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



