PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెంచు కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, సున్నిపెంట: దాతల సహకారంతో శ్రీ దుర్గ నాగ లింగేశవర స్వామి ఆశ్రమము(లింగాల గట్టు శ్రీశైలం మండలం)ఆంజనేయస్వామి ఆధ్వర్యంలో చెంచు గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఐదు కేజీల బియ్యం, కందిపప్పు,నూనె ప్యాకెట్, చక్కెర, టీ.పొడి నిత్యావసర సరుకులు 80 కుటుంబాలకు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐటీయూ శ్రీశైలం మండల అధ్యక్షులు దర్శనం నాగరాజు మాట్లాడుతూ ” కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిరుపేద కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా మాస్క్​ ధరించి, శానిటైజ్​ వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోన కారణంగా ఉపాధి లేక అవస్థలు పడుతున్న పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7500 అందజేసి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఉమా, దుర్గా,దేవి,రమణ,వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

About Author