PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డైట్ కళాశాల అధ్యాపకురాలికి డాక్టరేట్

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : కడప జిల్లా రాయచోటి డైట్ కళాశాలలో సైకాలజీ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న గౌ.. శ్రీమతి యం.వరలక్ష్మి గారికి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం కళాశాలలోఅధ్యాపకురాలిని తోటి అధ్యాపకులు పూలబొకేఅందించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైకాలజీ సబ్జెక్ట్ నందు కళాశాల విద్యార్థుల్లో చదవటం లో వాయిదా వేయడం వల్ల కలిగే దుష్పరిణామాలపై పరిశోధన చేసినందులకు గాను వరలక్ష్మీ గారికి డాక్టరేట్ ప్రధానం చేయడం అభినందనేయమన్నారు.అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author