PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి

1 min read

– ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ వసీవుల్లా భఖ్తియారీ
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయచోటిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2021 – 2022 విద్యాసంవత్సరానికి ఆన్ లైన్ ప్రవేశాలు ఈనెల 16 నుంచి ప్రారంభం అవుతాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ వసివుల్లా బఖ్తియారి తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరబోయే విద్యార్థులు దరఖాస్తు చేసుకోగలరన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ డెస్క్‌ను సంప్రదించి ఆన్ లైన్ ప్రవేశాల ద్వారా కళాశాలలో వారుకోరుకున్న గ్రూపుల్లో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఇప్పటికే కళాశాలలో అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కళాశాల వద్దకు వచ్చి ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలకు అప్లై చేసుకోవాలన్నారు. బిఎస్సీలో ఎంపిసీ, ఎంపీసిఎస్, బిజ్ డ్సీ కోర్సులు బికాంలో జనరల్, కంప్యూటర్ అప్లికేషన్ మరియు బిఎ లో హెచ్ పిఈ, హెచ్ పియు ఉర్దూ మీడియం కోర్సులు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ వసివుల్లా బఖ్తియారి ఒక ప్రకటనలో తెలిపారుఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

About Author