PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉప విద్యాశాఖాధికారి వల్లపు రంగారెడ్డికి ఘన సన్మానం

1 min read


పల్లెవెలుగువెబ్​, రాయచోటి : ఉపాధ్యాయ వృత్తిలో ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఉప విద్యాశాఖాధికాధికారి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ వల్లపు రంగారెడ్డి కి రాయచోటి డైట్ కళాశాలలోశుక్రవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ పాఠ్య పుస్తక రచయిత గా, అధ్యాపకుడుగా, అధికారిగా , వందల మంది విద్యార్థులకు ఉపాధ్యాయ శిక్షకుడిగా రంగారెడ్డి అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అనంతరం పలు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గజమాలలు వేసి శాలువాలతో సత్కరించి మోమేంటోలు బహుకరించారు. కళాశాల విద్యార్థులు ఆట పాటలతో అలరించారు.కళాశాల అధ్యాపకుల బృందం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం బహుకరించిఘనంగా సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి, రవీంద్రనాథ్ బాబు, నాగముణి రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు, మండల విద్యాశాఖ అధికారులు, డైట్ విద్యార్థులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author