PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ముందా !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీ చేసింద‌ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు. వైకాపా తీరు వ‌ల్లే ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను టీడీపీ బ‌హిష్కరించింద‌ని ఆయ‌న తెలిపారు. అధికార పార్టీకి పోలీసులు స‌హ‌క‌రించార‌ని, ఈ ఎన్నిక‌లు ప్రజాతీర్పుకు నిద‌ర్శ‌నం కాద‌న్నారు. ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ము జ‌గ‌న్ కు ఉందా ? అంటూ ప్రశ్నించారు. వైకాపా ప్రజాస్వామ్యాన్ని ఎలా అప‌హాస్యం చేసిందో దేశం మొత్తం చూసింద‌న్నారు. మెజార్టీ స్థానాల్లో ఏకగ్రీవాల కోసం అక్రమ కేసులు బ‌నాయించార‌ని ఆరోపించారు.

About Author