PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో ఐఏఎస్​ అధికారుల బదిలీలు!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: ఏపీలో శుక్రవారం ప్రభుత్వ ఛీఫ్​ సెక్రెటరీ డాక్టర్​ సమీర్​శర్మ పలువురు ఐఏఎస్​ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ఆయా ఐఏఎస్​ అధికారులకు శాఖలను మార్చారు. సమీర్​శర్మ ప్రభుత్వ సీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజే పలువురు ఐఏఎస్​ అధికారులకు శాఖలు మార్చడం గమనార్హం.
బదిలీ అయిన ఐఏఎస్​ అధికారుల్లో పౌరసరాఫరాల శాఖ కమిషనర్​గా ఎం.గిరిజాశంకర్​(2001వ బ్యాచ్​), పంచాయతీరాజ్​ శాఖ కమిషనర్​గా కోన శ్రీధర్​(2003), దేవాదాయ శాఖ కమిషనర్​గా ఎం.హరిజవహర్​లాల్​(1996), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా జి.ఎస్​.నవీన్​కుమార్​(2007), నీటివనరుల శాఖ కార్యదర్శిగా ఉన్న జె.శ్యామలరావు(1997)కు ఆర్​అండ్​ఆర్ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

About Author