PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడప నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరించండి..జగన్​కు బాబు లేఖ

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: కడప నుంచి విమాన సర్వీసులను పునరుద్దరించాలంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు సీఎం జగన్​కు లేఖాస్త్రం సంధించారు. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా… ముఖ్యంగా రవాణ వ్యవస్థే ప్రధానమన్నారు. 2018లో తెదేపా హయాంలో కడప నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉదాన్​ పథకం కింద టైర్​–2, టైర్​–3 నగరాల మధ్య విమాన సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. అప్పట్లో కడప, నెల్లూరు, అనంతపురం జిల్లా ప్రజలు హైదరాబాద్​, విజయవాడ, బెంగుళూరు నగరాలకు వెళ్లేందుకు విమాన సర్వీసులను సద్వినియోగం చేసుకున్నారని పేరొన్నారు. ప్రస్తుతం కడప నుంచి విమానయాణ సదుపాయం లేక ఆయా జిల్లాల ప్రజలు, వ్యాపార వేత్తలు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాబు లేఖలో పేర్కొంటూ విమాన సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.

About Author