PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాడ్మింటన్​ విజేతలకు..ప్రోత్సాహక బహుమతి అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయచోటి డైట్ హాస్టల్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న షటిల్ కోర్టు నందు జరిగిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో గెలిచిన విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. మొదటి విజేత నిస్సార్​, వెంకటేశ్వర్లు టీమ్​కు మాజీ అధ్యక్షులు లయన్ నాగార్జున ఆచారి చేతులమీదుగా 3000 ,2వ విజేత వంశీ మరియు సుబ్రహ్మణ్యం టీముకు రీజనల్ కోఆర్డినేటర్ లయన్ హరినాధ్ రెడ్డి చేతులమీదుగా రూ. 2000నగదు , 3వ విజేత జగదీశ్ మరియు లయన్ కిషోర్ కుమార్ రాజు టీముకు షణ్ముఖ డ్రెసెస్ అధినేత కిషోర్ కుమార్ రెడ్డి గారిచే 1000 రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా రీజనల్​ కో ఆర్డినేటర్​ లయన్​ హరినాథ్​ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మానసిక ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారని, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు లయన్ నాగార్జున ఆచారి, బాడ్మింటన్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి,డాక్టర్ శ్రీనివాసులు లయన్ కిషోర్ కుమార్ రాజు, ఉపాధ్యక్షులు లయన్ హరీష్ చంద్ర,కార్యదర్శి లయన్ ఇందాద్ అహమ్మద్,లయన్ కిషోర్ కుమార్ రాజు,లయన్ శ్రీనివాసులు(భూపతి) తదితరులు పాల్గొన్నారు.

About Author