PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టాభిరామ్​కు 14రోజుల రిమాండ్​!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్​కు విజయవాడ మూడో అడిషనల్ మెట్రోపాలిటిన్ కోర్టు 14రోజులపాటు నవంబర్​ 4వ తేదీ దాకా రిమాండ్​ విధించింది. ఈమేరకు మచిలీపట్నం సబ్ జైల్​కు తలరించారు. అయితే పట్టాభి బెయిల్​ పిటిషన్​పై విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. పట్టాభి వైసీపీ ప్రభత్వం, సీఎం. జగన్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బుధవారం రాత్రి పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు .. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే. గురువారం వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తదుపరి కోర్టులో హారుపర్చారు.

About Author