PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డీఏలు లేవు.. పండగకు జీతాలు రావు…!

1 min read

పల్లెవెలుగువెబ్​, మహానంది: కర్నూలు జిల్లా మహానంది దేవస్థానంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు మూడేళ్లుగా డీఏలు రాలేదని తెలిసింది. దీపావళి పండగ సందర్భంగా సాధారణ ఉద్యోగులకు జీతాలు కూడా రాలేదని సమాచారం. కోవిడ్​, ఇతర కారణాలతో 50 మందికి పైగా ఉద్యోగులకు డీఏలు రాకపోగా… వచ్చే జీతం కూడా సరైన సమయానికి రావడంలేదని కొందరు ఉద్యోగులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. దసరా పర్వదినం కంటే ముందే చెల్లించాల్సిన అడ్వాన్సులు పండుగ అనంతరం దేవస్థాన ఉద్యోగులకు చెల్లించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పండుగలు పర్వదినాలు సందర్భాల్లో దేవస్థానం లో పనిచేసే ఉద్యోగులకు మరియు సిబ్బంది కి సకాలంలో జీతాలు చెల్లించాలని, డీఏలు ఇవ్వాలని ఆలయ ఉద్యోగులు కోరుతున్నారు.

About Author