PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీసీఐ డాక్టర్స్​ ప్యానెల్​కి ఎంపికైన కర్నూలు రిటైర్డు జేసీ తనయుడు..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: బీసీసీఐ దేశవ్యాప్త క్రికెట్​ టోర్నమెంట్స్​ అయిన ముస్తాఖ్​ ఆలీ టీ20, రంజి, విజయ్​ హజారె తదితర ట్రోపీలకు డాక్టర్స్​ ప్యానెల్స్​కు రిటైర్డు జాయింట్​ కలెక్టర్​ శ్రీ సయ్యద్​ ఖాజా మొహిద్దీన్​ పెద్ద కుమారుడు డాక్టర్​ జావిద్​ ఎంపికయ్యారు. ప్రస్తుతం డా. జావెద్​ హైదరాబాద్​ అపోలో ఫ్యామిలీ మెడిసిన్​ స్పెషలిస్ట్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 16 నుంచి ఢిల్లీలో జరగబోయే నాకౌట్​ దశల నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇందుకు శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకున్నారు.

ఈ సందర్భంగా డా. జావెద్​ మాట్లాడుతూ.. చిన్న తనం నుంచి నేను క్రికెట్​ వీరాభిమానిని. డాక్టర్​గా బీసీసీఐలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నిజాయితీతో నా విధులను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

About Author