NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇండియా భ‌విష్యత్ పై గూగుల్ సీఈవో కీల‌క వ్యాఖ్యలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: భార‌తదేశ భ‌విష్యత్తు ప‌ట్ల గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ భ‌విష్యత్తు ప‌ట్ల తాను ఎంతో ఉత్తేజితంతో ఉన్నాన‌ని తెలిపారు. అనేక స్టార్ట్ అప్ కంపెనీలు త‌మ‌ను తాము నిరూపించుకుంటుండ‌టం  సంతోష‌క‌రంగా ఉంద‌ని పేర్కొన్నారు. భార‌త్ లోని  కంపెనీలకు సహకరించాలనుకుంటున్నట్లు, అవి తమ కార్యలాపాలను విస్తరించడం కోసం అవసరమైన కృత్రిమ మేధాశక్తి, సాంకేతిక పరిజ్ఞానాలను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. కంపెనీల‌ను ఏర్పాటు చేసి, వాటిని అంతర్జాతీయ స్థాయికి చేర్చే ప్రదేశంగా తాము భారత దేశాన్ని చూస్తున్నామని, అందుకే తాము గూగుల్ పే లో పెట్టుబడులు పెట్టామని  చెప్పారు. అన్ని విధాలుగా ప్రోత్సహించగలిగే పాత్రను తాము పోషించాలనుకుంటున్నట్లు తెలిపారు.

About Author