PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ నిషేధించిన ప్ర‌భుత్వం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఢిల్లీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ నిషేధించింది. దేశ రాజ‌ధాని ఢిల్లీ 5 నెల‌ల త‌ర్వాత కేసుల సంఖ్య పెరగ‌డం మొద‌లైంది. అన్ని ర‌కాల ప‌బ్లిక్ స‌మావేశాల‌ను నిషేధించ‌డ‌మే మేల‌నే అభిప్రాయానికి ఢిల్లీ ప్ర‌భుత్వం వ‌చ్చింది. ఈ మేర‌కు డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్ర‌క‌ట‌న చేసింది. ఇటీవల కేంద్ర ప్ర‌భుత్వం కూడ ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర‌త‌ను అంచ‌నా వేసి.. క‌ట్ట‌డి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది. పండుగ స‌మ‌యాల్లో వైర‌స్ వ్యాప్తి జ‌ర‌గ‌కుండా చూడాల‌ని హెచ్చ‌రించింది.

                           
  

About Author