PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ్మ భాషను కాపాడుకుందాం: అరసం

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: కమ్మనైన అమ్మ భాష తెలుగు భాషను కాపాడుకుందామని అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ విద్యార్థులకు ఉపదేశించారు.  గురువారం మండలంలోని దేవనబండ గ్రామం ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాష వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వకృత్వ పోటీలు, ఆటల పోటీల లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులను ప్రధానం చేశారు. ఉగ్గుపాలతో అమ్మ ద్వారా నేర్చుకున్న కమ్మనైన అమ్మ భాషను మరువ కూడదు అని అన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగేటి ప్రసాదు, సులోచనమ్మ లలితమ్మ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author