PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవస్థాన ఒప్పంద ఉద్యోగికి ఆర్ధిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్​:  శ్రీశైల దేవస్థానంనందు అడ్డు ప్రసాద విభాగములో కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న శ్రీ యం. కృష్ణ, అనారోగ్య కారణంగా 16.10.2021న మరణించారు. ఇందుకుగాను శ్రీశైల దేవస్థానం నందు పనిచేయుచున్న ఒప్పంద మరియు పొరుగుసేవల | సిబ్బంది వారి నెలవారీ జీతం నుండి ఒకరోజు వేతనం మొత్తాన్ని రూ.1,82,961లు ఈ రోజు వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ మేరకు ఈ రోజు సంబంధిత డిమాండ్ డ్రాఫ్ట్ ను మరణించిన ఉద్యోగి భార్య శ్రీమతి యం. లక్ష్మీచైతన్యకు కార్యనిర్వహణాధికారి వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒప్పంద మరియు పొరుగుసేవల యూనియన్ ప్రెసిడెంట్ బాలాజీనాయక్ మరియు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author