PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీ నాయకులను విమర్శించడం సరికాదు…..

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి  రామకృష్ణ బిజెపి నాయకులను విమర్శించడం సరికాదని బిజెపి పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసప్ప అన్నారు. గురువారం మండల కేంద్రమైన ఆసుపత్రిలో స్థానిక బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బిజెపి పార్టీ  రాష్ట్రానికి ఏమి చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీరరాజును పిచ్చి కుక్క కరిచింది అనడం సరికాదని బిజెపి పార్టీ రాష్ట్రానికి ఏమి చేసిందో ప్రజలకు తెలుసన్నారు.  కమ్యూనిస్టు పార్టీలు ప్రజల పక్షాన మేమున్నామని ప్రజల సమస్యలు పై నిరంతరం పోరాడుతున్నామని ప్రజలు మా పక్షానే ఉన్నారని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అంటున్నారు కానీ ప్రజలకు కమ్యూనిస్టు పార్టీలు ఏమి చేశారని ప్రశ్నించారు. ప్రజలకు అండగా ఉంటామని గొప్పలు చెప్పుకోవడం తప్ప కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజలకు  చేసిందేమీ లేదన్నారు. ఏది ఏమైనప్పటికిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర బిజెపి నాయకులను విమర్శించడంతీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో రామదాసు, నారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author