PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కంట‌త‌డి పెట్టిన కేఈ క్రిష్ణ‌మూర్తి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీడీపీ సీనియ‌ర్ నేత కేఈ క్రిష్ణ‌మూర్తి భావోద్వాగానికి గుర‌య్యారు. వైసీపీ ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపుకు పాల్ప‌డుతోంద‌ని కంట‌త‌డి పెట్టారు. క‌ర్నూలు జిల్లాలోని క్రిష్ణగిరి మండలం కంబాలపాడులో మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కంబాలపాడు కేఈ స్వగ్రామం. కంబాలపాడుకు వచ్చిన కేఈకి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.తమపై ఎంత కసి ఉన్నా వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ గాలి వచ్చినప్పుడే తాను గెలిచానని ఆయన గుర్తుకు చేశారు. కార్యకర్తల కోరిక మేరకు కంభాలపాడుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని తీసుకొస్తానని కేఈ క్రిష్ణమూర్తి తెలిపారు.

                                    

About Author