NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజ‌ధానిలో బాంబు క‌ల‌క‌లం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో బాంబు క‌ల‌క‌లం రేగింది. స్థానిక ఘాజీపూర్‌ ఫ్లవర్‌ మండీలో ఒక బ్యాగ్‌ ఉండటాన్ని స్థానికులు గమనించారు. చాలాసేపటి నుంచి బ్యాగ్‌ మార్కెట్‌లోనే ఉండటంతో అనుమానంతో.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, నేషనల్‌సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక పరికరంతో బ్యాగ్‌ స్కాన్‌ చేసి పరిశీలించారు. ఆ బ్యాగ్‌లో పేలుడు పదార్థం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్థానికులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. భారీగా భద్రత దళాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. బ్యాగ్‌లో 3 కిలోల ఐఈడీ పేలుడు పరికరం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత.. ఒక రోబో సహయంతో ఆ బ్యాగ్‌ను మైదాన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భూమిలో ఎనిమిదడుగుల లోతులో ఆ పరికరాన్ని ఉంచి బాంబ్‌ను నిర్వీర్యం చేశారు.

                                             

About Author