PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ సీఐడీ చీఫ్ నుంచి ప్రాణ‌హాని.. ప్ర‌ధానికి ఫిర్యాదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఆరోపించారు. ఈ మేర‌కు ప్ర‌ధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జగన్‌తో కుమ్మక్కై సునీల్‌ తన ప్రాణానికి హాని తలపెట్టారని అన్నారు. సునీల్ ఆధ్వర్యంలో నడిచే అంబేద్కర్ ఇండియా మిషన్ సంస్థ ద్వారా రాష్ట్రంలో పలు పీఎస్‌లలో కేసులు నమోదు చేయించారని రఘురామ పేర్కొన్నారు. విచారణకు పిలిచి హతమార్చాలనే ప్రణాళిక రచించారని, గతేడాది మే 14న తనను కస్టోడియల్‌ టార్చర్‌కు గురి చేశారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత గుంటూరు జైలుకు పంపి అక్కడే హత మార్చాలని కుట్ర పన్నారని.. అప్పుడు కుదరక ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నారని రఘురామ ప్రధానికి తెలిపారు.

                                   

About Author