PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏ కులం వారు.. ఆ కులం పనే చేయాల‌న‌డం దుర్మార్గం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చిన‌జీయ‌ర్ స్వామి వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ సీపీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట రెడ్డి మండిప‌డ్డారు. చిన‌జీయ‌ర్ స్వామి ఇటీవ‌ల చేసిన ప్ర‌వ‌చ‌నాలు ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న రేకెత్తిస్తున్నాయ‌ని అన్నారు. కులాల నిర్మూలన తగదని, ఏ కులం వారు ఆ కులం పనేచేయాలని, మాంసాహారులు ఏ మాంసం తింటారో ఆ జంతువుల మాదిరిగానే వ్యవహరిస్తారని.. ఆయన చెబుతున్న మాటలు మధ్యయుగాన్ని గుర్తు తెస్తున్నాయన్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విగ్రహానికి సంకుచిత భావాలతో ‘‘సమానత్వ ప్రతిమ’’ పేరు పెట్టడం విడ్డూరం అని చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన‌జీయ‌ర్ స్వామి ప్ర‌వ‌చ‌నాలు బ‌హుజ‌నుల‌ను కించ‌ప‌రిచే విధంగా ఉన్నాయ‌ని, ఆయ‌న కార్య‌క్ర‌మాల‌కు ముఖ్య‌మంత్రి లాంటి ఉన్న‌త హోదా ఉన్నవారు హాజ‌రు కావ‌డం స‌రైంది కాద‌ని అన్నారు.

                          

About Author