PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోని జిల్లా చేయండి.. లేదంటే కర్ణాటకలో కలిపేయండి !

1 min read

పల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత తిక్కారెడ్డి ఆసక్తికర డిమాండ్ తెరమీదకి తెచ్చారు. ఆదోనిని జిల్లాగా చేయాలని.. లేకపోతే మమ్మల్ని కర్నాటకలో లేదా తెలంగాణలో కలిపేయండన్నారు. ఆదోనిని జిల్లాగా చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో మాట్లాడాలని తిక్కారెడ్డి డిమాండ్ చేశారు. వ్యాపార రంగానికి రెండో ముంబాయిగా పేరుగాంచిన ఆదోనిని జిల్లాగా చేయాలని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి పేర్కొన్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఆదోని తాలుకాలు గతంలో కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలో ఉండేవన్నారు. ఆదోని డివిజన్‌లో సాగు, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని తిక్కారెడ్డి పేర్కొన్నారు. ఆదోని ప్రాంతం కర్నాటక బార్డర్‌లో ఉండటం వలన తమ కల్చర్, ల్యాంగ్వేజ్ వేరేగా ఉంటుందన్నారు.

        

About Author