PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలంగాణలో మోదీ పర్యటన.. సోషల్ మీడియా సెగ !

1 min read

పల్లెవెలుగువెబ్ : తెలంగాణలో మోదీ పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ లోని రామానుజ సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానిని ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది. ఈ మేరకు తెలంగాణకు చెందిన నెటిజన్లు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ట్విట్టర్ వేదికగా తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు.

        

About Author