PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవు !

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్ణాటకలోని ఉడిపి కళాశాలలో ప్రారంభమైన హిజాబ్‌ వివాదం క్రమేపీ ఆ రాష్ట్రమంతా విస్తరిస్తోంది. హింసాత్మక రూపు దాల్చింది. రెండు మతాలకు చెందిన విద్యార్థులు పోటాపోటీగా ఇస్తున్న నినాదాలతో పవిత్ర విద్యాసంస్థల ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. పలు కళాశాలల్లో మంగళవారం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడటం తీవ్ర ఉద్రిక్తతలను రేపింది. పరిస్థితి క్రమేపీ చేయి దాటిపోతుండడంతో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై బుధవారం నుంచి రాష్ట్ర్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ, పీయూ కళాశాలలతోపాటు హైస్కూళ్లకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు.

        

About Author