PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్ కౌంట‌ర్.. అమ‌రులైన ఇద్ద‌రు జ‌వాన్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జమ్మూ-కశ్మీరులోని షోపియాన్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనిక సిబ్బంది అమరులయ్యారు, ఓ ఉగ్రవాది హతమయ్యాడు. జైనపొర ప్రాంతంలోని చెర్మార్గ్ గ్రామం వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మరణించిన ఉగ్రవాదిని గుర్తించేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో చెర్మార్గ్ గ్రామంలో కార్డన్, సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు ఓ అధికారి తెలిపారు. పోలీసులు, సైన్యం, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా ఈ కార్యకలాపాలను నిర్వహించాయన్నారు. శనివారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ ప్రారంభమైందన్నారు. సంయుక్త బృందం ఈ గ్రామాన్ని చుట్టుముట్టి, సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారన్నారు. దీంతో సంయుక్త బృందం ప్రతిస్పందించిందన్నారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారని, ఓ ఉగ్రవాది హతుడయ్యాడని చెప్పారు.

                                   

About Author