PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

1 min read

–  10 మందికి గాయాలు

పల్లెవెలుగు వెబ్​, చాగలమర్రి: మండలంలోని పెద్దబోధనం గ్రామ సమీపంలోని 40 వ జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా , మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు . తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన డయాకర్రెడ్డి టీఎన్ 23 సీబీ 5550 నంబరు గల మహేంద్ర కారులో కర్నూలు నుంచి వేలూరుకు వెలుతుండగా పెద్దబోధనం సమీపానికి చేరుకోగానే ముందుభాగం టైరు పగిలి డివైడర్  ఎక్కి ఎదురుగా ఉన్న రహదారిపైకి వేగంగా వచ్చింది . కడప నుంచి హైదరాబాదుకు వెలుతున్న టీఎస్ 09 ఎఫ్ఎ 4444 నంబరుగల ఇన్నోవా వాహనం ను ఢీకొంది . దీంతో తమిళనాడుకు చెందిన అరుణ్కుమార్రెడ్డి ( 34 ) అక్కడికక్కడే మృతి చెందారు . రెండు వాహనాల్లోని మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు . వాహనాల్లోని దయాకర్‌రెడ్డి,ప్రేమలతో పాటు హైదరాబాదుకు చెందిన వెంకటక్రిష్ణ , సుధాకర్ , భోగేశ్వరి , రవిచంద్రకుమార్ , తేజస్వీ, చంద్రారావుతో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు . క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . విషయం తెలుసుకున్న ఎస్సై రమణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో ఇరుక్కుని మృతి చెందిన అరుణ్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని అతికష్టం మీద బయటకు తీశారు . ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నంద్యాలఎమ్మెల్యే పరామర్శ : మండలంలోని పెద్దబోధనం సమీపంలో జరిగిన రహదారి ప్రమాద బాధితులను నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్రకిషోరెడ్డి పరామర్శించారు . డిప్యూటీ సీఎం : అంజాద్‌ బాష  కుటుంబంలోని వివాహానికి హాజరై నంద్యాలకు తిరిగి వెలుతున్న ఎమ్మెల్యే రవిచంద్రకిషోర్రెడ్డి పెద్దబోధనం సమీపంలో జరిగిన ప్రమాదస్థలిని  పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను స్వయంగా అంబులెన్సు, తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

About Author