PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరులో… పల్స్ పోలియో విజయవంతం

1 min read

 పల్లెవెలుగు వెబ్, మిడుతూరు: మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు మరియు ప్రజాప్రతినిధులు విజయవంతం చేశారు. మాసపేటలో మిడుతూరు మండల జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరముల లోపు ఉన్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు. కడుమూర్ గ్రామంలో పీహెచ్సీ వైద్యులు శివకుమార్ గౌడ్ మరియు గ్రామ సర్పంచ్ జీవరత్నం, మిడుతూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ మరియమ్మ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉపసర్పంచ్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి, బైరాపురంలో సర్పంచ్ ఫణి భూషణ్ రెడ్డి, తిమ్మాపురంలో నాగ స్వామి రెడ్డి, 49 బన్నూరు గ్రామంలో జి భూదేవి,చౌటు కూరు మదర్ సా, రోళ్ళపాడు రామస్వామి రెడ్డి, పై పాలెం మర్రి రామచంద్రుడు, నాగలూటి ఉషారాణి తదితర గ్రామాలలో అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పోలియో చుక్కలను వేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రంగస్వామి,సూపర్వైజర్లు ఏసేపు,విలాస కుమారి, హెల్త్ అసిస్టెంట్ కరుణానిధి, జ్యోతి నిర్మల, ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఉమాదేవి శైలజ రమణమ్మ పద్మావతి అనిత లక్ష్మీదేవి శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

About Author