PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెన్నై మేయ‌ర్ గా తొలి ద‌ళిత మ‌హిళ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌గా ప్రియ‌ను ఎన్నుకున్నారు. తొలిసారి ఎన్నికైన దళిత మహిళగా ప్రియ రికార్డుల‌కెక్కింది. శుక్రవారం ఆమె ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 200 మంది కార్పొరేటర్లలో 153 మంది డీఎంకే కార్పొరేటర్లు ఆది ద్రావిడ (ఎస్‌సీ) వర్గానికి చెందిన ప్రియను మేయర్‌గా ఎన్నుకున్నారు. 350 సంవత్సరాల చెన్నై కార్పొరేషన్‌ చరిత్రలో దళిత మహిళ మేయర్‌ పదవిని అధిరోహించగా, ఆ పదవిని సొంతం చేసుకున్న 28 ఏళ్ల ప్రియ అతి పిన్నవయస్కురాలిగానూ రికార్డులకెక్కారు. ప్రియ భర్త రాజా ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ప‌నిచేస్తున్నారు.

                                          

About Author