PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రాఫిక్​ పై ప్రత్యేక దృష్టి.. :ఎస్​ఐ హుసేన్​ బాష

1 min read

పల్లెవెలుగు వెబ్. గడివేముల: కర్నూలు జిల్లా గడివేముల మండలంలో ట్రాఫిక్​ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల విజ్ఞప్తులు.. ప్రయాణికుల అవస్థలను దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్​ ఎస్​ఐ హుసేన్​ బాష సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.  మండల కేంద్రంలో రోడ్డుకిరువైపులా ఉన్న దుకాణాల ముందు వాహనాలు నిలబెట్టడం, బురద ఉండటం వల్ల కొన్నేళ్లుగా ప్రజలు ట్రాఫిక్​ సమస్యతో సతమతమవుతున్నారు.  ఆదివారం ట్రాఫిక్​ ఎస్ఐ హుసేన్​బాష నేతృత్వంలో రహదారికి ఇరువైపులా  మట్టి పూడిక తీయించారు. దుకాణాల ముందు వాహనాలను ఇష్టానుసారంగా నిలిపితే…చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవలె బాధ్యతలు స్వీకరించిన ట్రాఫిక్​ ఎస్​ఐ హుసేన్​బాష… సమస్యపై ప్రత్యేక దృష్టిసారించి పరిష్కరించడం అభినందనీయమని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About Author