PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుర్తు తెలియని వాహనం ఢీ..సాఫ్ట్​వేర్​ ఉద్యోగి మృతి…

1 min read

పల్లెవెలుగు వెబ్​: చాగలమర్రి పట్టణం మీదుగా వెళ్లే 40 వ జాతీయ రహదారిపై ఎస్సార్‌ పెట్రోలు బంకు సమీపంలో ఆదివారం తెల్లవారు ఝామున గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ రమణయ్య  తెలిపిన వివరాల మేరకు… నెల్లూరు పట్టణంకు చెందిన సాఫ్ట్​ వేర్​ ఉద్యోగి కుంచె వెంకటేష్‌ (26) బెంగుళూరులో సాప్ట్‌వేర్‌ ఇంజనీరు గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వర్క్‌ ప్రమ్‌ హోమ్‌ ఉండటంతో కడప జిల్లా బద్వేల్‌లో స్నేహితుల వద్ద ఉంటూ విధులు నిర్వహించే వాడు. తన సొంత ద్విచక్ర వాహనం హైదరాబాదులో ఉండటంతో తెచ్చుకొనేందుకు వెళ్ళాడు. హైదరాబాద్ నుండి గత రాత్రి తన ద్విచక్ర  వాహనంపై బద్వేలుకు వస్తుండగా చాగలమర్రి గ్రామ శివార్లలో గుర్తు తెలియని వాహనం డీ కొంది. దీంతో వెంకటేష్‌ మృతి చెందాడని ఎస్‌ఐ వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సిసి పుటేజ్‌ల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకి కై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలియజేసారు.

About Author