PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చూస్తుండ‌గానే కుప్ప‌కూలిన గ్యాల‌రీ.. వందలాది మందికి గాయాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేరళలో ఘోర ప్రమాదం జ‌రిగింది. ఫుట్‌బాల్ మ్యాచ్‌ జరుగుతుండగా.. ఒక్కసారిగా ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలింది. మలప్పురం జిల్లాలోని పూంగోడ్‌లో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కేరళలో ఆల్ ఇండియా సెవెన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి పూంగోడ్‌లోని ఎల్‌పీ స్కూల్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. సామర్థ్యానికి మించి రావడంతో మైదానంలోని గ్యాలరీలు నిండిపోయాయి. అయితే ప్రేక్షకులు మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఒకవైపు ఉన్న గ్యాలరీ కుప్పకూలిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ఏకంగా 8వేల మంది హాజరైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

                               

About Author