PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వారి జోలికి ఇంకెవ‌రూ రాలేరు !

1 min read

పల్లెవెలుగువెబ్ : క‌శ్మీర్ పండిట్ల జోలికి మరోసారి ఎవ‌రూ రాలేర‌ని వ్యాఖ్యానించారు ఆర్ఎస్ఎస్ నేత మోహ‌న్ భ‌గ‌వ‌త్. త‌రిమివేయ‌బ‌డ్డ క‌శ్మీరి పండిట్లు త‌మ‌ ప్రాంతానికి తిరిగి వెళితే ఎవ‌రూ వారిని నిర్వాసితులు చేయ‌లేర‌ని అన్నారు. కశ్మీరీ పండిట్లు తమ ఇళ్ళకు వెళ్లే రోజు చాలా దగ్గరలోనే ఉందని భావిస్తున్నానని చెప్పారు. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తీవ్రవాదం వల్ల కశ్మీరును వదిలిపెట్టామని, ఇప్పుడు మళ్లీ తిరిగి వెళ్తామని, హిందువులుగా, భారత దేశ భక్తులుగా వెళ్తామని, మా భద్రత, జీవినోపాధి పట్ల భరోసాతో వెళ్తామని కశ్మీరీ పండిట్లు దృఢ సంకల్పంతో ఉండాలని చెప్పారు. ‘‘ఎవరూ మమ్మల్ని నిర్వాసితులను చేసే సాహసం చేయబోరనే విధంగా మేం జీవిస్తాం’’ అనే దృఢసంకల్పంతో వ్యవహరించాలని తెలిపారు.

                                    

About Author