PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముంబై.. కేంద్ర‌పాలిత ప్రాంతంగా చేసే కుట్ర !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ముంబైను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీ నేతలు కొందరు వ్యూహరచన చేస్తున్నారని శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ అన్నారు. ఈ గ్రూప్‌నకు కీరిత్ సోమయ్య నాయకుడని చెప్పారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో రౌత్ మాట్లాడుతూ, కొందరు నేతలు, వ్యాపారవేత్తలు, బిల్డర్లు ఈ గ్రుపులో ఉన్నారని, రెండు నెలలుగా ఈ గ్రూపు కసరత్తు చేస్తోందని, ఇందుకు సంబంధించి హోం మంత్రి ముందు ఒక ప్రెజెంటేషన్‌ కూడా రెడీ చేశారని ఆరోపించారు. మరాఠీ భాష మాట్లాడేవారి సంఖ్య ముంబైలో తగ్గిందనే కారణం వీరు కోర్టుకు వెళ్లవచ్చని, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరే అవకాశం ఉందని రౌత్ అన్నారు.

                                          

About Author