PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుండు గీయించుకున్న సర్పంచ్.. ఎందుకంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పంచాయతీలకు మంజూరైన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించడాన్ని నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా పెదలబుడు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు శిరోముండనం చేయించుకున్నారు. పంచాయ తీ పాలక వర్గంలోని మిగిలిన సభ్యులు అర్ధనగ్నంగా ఆందోళన చేశారు. వారికి మాదల సర్పంచ్‌ శ్రీనివాస్‌, వైసీపీకి చెందిన డుంబ్రిగుడ మండలం కొర్రాయి సర్పంచ్‌ కిండంగి కొములు మద్దతు పలికారు. నిధుల మళ్లింపునకు నిరసనగా పెదలబుడు పంచాయతీ పాలకవర్గం బుధవారం నుంచి అరకులోయలో రిలే నిరాహార దీక్షలు చేపట్టింది.

                                      

About Author