PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచితాల‌ను నియంత్రించ‌లేం ..ఎన్నిక‌ల క‌మీష‌న్ స్ప‌ష్టం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల్ని అడ్డుకోలేమని ఎన్నికల క‌మీష‌న్ స్పష్టం చేసింది. చట్టంలో సరైన మార్పులు చేయకుండా, పార్టీలు, ప్రభుత్వాలపై చర్యలు తీసుకోలేమని చెప్పింది ఈసీ. ఉచిత పథకాలు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా ఈసీ ఈమేరకు అఫిడవిట్ సమర్పించింది. ‘‘పార్టీలు ఎన్నికలకు ముందు.. లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చే ఉచిత పథకాల్ని నియంత్రించడం సాధ్యంకాదు. ఆ పథకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపినాసరే వాటిని అడ్డుకోలేం. ఉచిత పథకాల విషయంలో అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ఓటర్లే. చట్టంలో మార్పులు చేయకుండా, ఈ విషయంలో పార్టీలను నియంత్రించాలనుకుంటే అది ఎలక్షన్ కమిషన్ అధికారాల్ని పరిధిదాటి ఉపయోగించినట్లే అవుతుంది’’ అని ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొంది.

                                       

About Author