PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చ‌దువు, సంధ్య లేని వ్యక్తి జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి పై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చదువు, సంధ్య లేని వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డిని, మంత్రి ఉషశ్రీకు మహిళా శిశు సంక్షేమ శాఖ గురించి తెలియదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. మంత్రి ఉషాశ్రీ చరణ్ ఉన్నత చదువులు చదివిన బీసీ మహిళ అని, ఆమె ఉన్నత చదువును, ఇంటిగ్రేటిని చూసే.. సీఎం జగన్ ఆమెకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక చావు చచ్చిన పార్టీ అని, ఆ పార్టీని ప్రజలు దిబ్బలోకి పడేశారని గోరంట్ల మాధవ్ అన్నారు.

                                

About Author