PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీస్ స్టేషన్లో న్యాయం జ‌ర‌గ‌దు.. ఫిర్యాదు చేయొద్దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శింగనమల మండలం నాయనవారిపల్లిలో చినీచెట్ల నరికివేతను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి పరిశీలించారు. పోలీసు స్టేషన్‌కు పోయి ఎలాంటి ఫిర్యాదు చేయొద్దని.. మీకు ఎలాంటి న్యాయం జరగదంటూ బాధిత రైతులు గుర్రం లక్ష్మినారాయణ, బోయ సుశీలప్పలకు ఓదార్పునిచ్చారు. ఒక పార్టీకి మద్దతు తెలుపుతారని చెట్లు నరికి వేస్తారా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరగదన్నారు. ఎవరికి వాళ్లు సహాయం చేసుకోవాలన్నారు. బాధిత రైతును గ్రామస్తులు ఆదుకోవాలని జేసే ప్రభాకరరెడ్డి కోరారు.

                                               

About Author