PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.. 40 బేసిస్ పాయింట్లు పెంపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్బీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అత్యంత కీలకమైన రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ మేరకు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ బుధవారం ప్రకటించారు. తాజా పెంపుతో రెపో రేటు 4.40 శాతానికి చేరింది. రెపో రేటు పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రెపో రేటు పెంపునకు మోనిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. సర్దుబాటు వైఖరిని ఉపసంహరించుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు క్యాష్ రిజ‌ర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు వెల్లడించింది. తాజా పెంపుతో సీఆర్ఆర్ 4.50 శాతానికి పెరిగిందని శక్తికాంత్ దాస్ చెప్పారు. ఈ ప్రభావంతో రూ.83,711.55 కోట్ల నగదు ఆర్థిక వ్యవస్థ నుంచి ఉపసంహరణ జరుగుతుందని వివరించారు.

                              

About Author