PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాధువుల‌కు క‌రోన‌..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ ప‌విత్ర కుంభ‌మేళాలో కరోన బుస‌లుకొడుతోంది. ఉత్తరాఖండ్ లోని హ‌రిద్వార్ లో జ‌రుగుతున్న కుంభ‌మేళాలో ల‌క్షలాది మంది భ‌క్తులు పాల్గొంటున్నారు. వేలాది మంది సాధువులు పాల్గొంటున్నారు. దాదాపు 30 మంది సాధువులకు క‌రోన సోకిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. క‌రోన‌తో ఒక సాధువు మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. రోజూ వారీ కోవిడ్ సంఖ్య కుంభ‌మేళాలో పెరిగిపోతోంద‌ని స్థానిక వైద్యులు చెబుతున్నారు. దీంతో సాధ‌వులు కుంభ‌మేళా వీడేందుకు సిద్ధమైన‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప‌విత్ర రాజ‌స్నానం పూర్తయినందున సాధువులు కుంభమేళ వీడ‌నున్నట్టు ప‌లువురు సాధువులు చెబుతున్నారు. కోవిడ్ కేసులు సాధువుల్లో పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆల్ ఇండియా అఖాడా ప‌రిష‌త్ నాయ‌కులు మ‌హంత్ న‌రేంద్రగిరి కూడ రిషికేశ్ లోని ఎయిమ్స్ లో చేరిన‌ట్టు తెలుస్తోంది.

About Author