మదరసాలలో జాతీయ గీతం తప్పనిసరి !
1 min read

పల్లెవెలుగువెబ్ : ఉత్తర ప్రదేశ్లోని మదరసాలలో జాతీయ గీతాలాపన గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర మదరసా ఎడ్యుకేషన్ బోర్డు మార్చి 24న తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని మే 9న అన్ని జిల్లాల మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రంజాన్ సెలవుల అనంతరం మదరసాలలో తరగతులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.

