PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెట్రోల్ లో 20 శాతం ఇథ‌నాల్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌లో 20శాతం వరకు ఇథనాల్‌ను కలపడానికి లక్ష్యంగా పెట్టుకున్న గడువును ఐదేళ్లు తగ్గించింది. తాజా నిర్ణయాన్ని అనుసరించి 2025-26 నాటికే ఈ లక్ష్యాన్ని ఆచరణలోకి తీసుకొస్తారు. అంతకుముందు దీనికి గడువును 2030గా కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ జీవ ఇంధన విధానంలో ప్రతిపాదించిన సవరణలను బుధవారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. ప్రస్తుతం పెట్రోల్‌లో 10శాతం వరకు ఇథనాల్‌ను కలపడానికి అనుమతిస్తున్నారు. అలాగే… దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల ద్వారా జీవ ఇంధనాల ఉత్పత్తిని ప్రోత్సహించాలని మంత్రివర్గం తీర్మానించింది.

                                

About Author