క్షమాపణలు చెప్పిన కమల్ హాసన్
1 min read

పల్లెవెలుగువెబ్ : తన చిత్రం విడుదల అయి నాలుగేళ్లు అవుతోందని, అందుకు అభిమానులకు క్షమాపణ చెబుతున్నట్లు కమలహాసన్ పేర్కొన్నారు. తాను సంపాదించింది తిరిగి చిత్ర పరిశ్రమలోనే పెడుతున్నానని, ఇకపై ప్రజల కోసం కూడా పెట్టుబడి పెడుతానని చెప్పారు. కరుణానిధి జయంతి అయిన 3వ తేదీన విక్రమ్ చిత్రాన్ని విడుదల చేయడమన్నది యాదృచ్ఛికమే అన్నారు. అయితే ఆయన తనకు ఇష్టమైన నాయకుడని పేర్కొన్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్ర మ్-3 చేయడానికి తాను సిద్ధమని తెలిపారు.

