PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎర్ర కొండ‌ల్ని అవంతి శ్రీనివాస్ తినేస్తున్నాడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైజాగ్ రుషికొండ వ్యూ చాలా‌ అద్భుతమైందని, దాన్ని కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేన కార్యకర్తలేనని జ‌న‌సేన నేత నాగ‌బాబు గుర్తు చేశారు. వైసీపీలో లంచగొండితనం సింగిల్ విండోలా తయారైందని, అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నాడని ఆరోపించారు. సమస్య వచ్చినప్పుడు ప్రజలకు గుర్తొచ్చే నాయకుడు పవన్ కల్యాణ్ అని నాగబాబు పేర్కొన్నారు. పవన్ వెళితే సమస్య తీరుతుందని నమ్మకం జనాలకు ఉందన్నారు. గతంతో పోలిస్తే ఉత్తరాంధ్ర కార్యకర్తలు చాలా మోటివేట్ అయ్యారని, పనిచేయని నాయకులను ప్రశ్నించే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. మంగళగిరిలో నాగబాబు మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై జనసైనికుల పోరాట‌ ప్రతిమ అమోఘమన్నారు.

                                         

About Author