PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త్ ను మెచ్చుకున్న చైనా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన శ్రీలంకకు భారత్ స‌హాయం అందించింది. డీజిల్‌, ఆహార ధాన్యాలను మోదీ సర్కార్‌ లంకకు పంపించింది. ఈ నేపథ్యంలో భారత్‌ అందిస్తున్న సహాయ సహకారాలను డ్రాగన్‌ కంట్రీ చైనా మెచ్చుకుంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్‌ మాట్లాడుతూ.. శ్రీలంక విషయంలో భారత ప్రభుత్వం అందించిన సాయం ప్రశంసనీయం. భారత్‌ ప్రయత్నాలను చైనా అభినందిస్తోంది. శ్రీలంక, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు వీలైనంత తర్వగా కష్టాల నుంచి బయటపడేందుకు సహాయం చేయడానికి భారత్‌, ఇతర అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని స‍్పష్టం చేశారు.

                                  

About Author