PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు భీమ‌వ‌రానికి ప్ర‌ధాని !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌న్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన భీమవరం చేరుకుంటారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహిస్తున్న అల్లూరి జయంతి వేడుకలో పాల్గొంటారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని అక్కడ నుంచే వర్చువల్‌ విధానంలో ఆవిష్కరిస్తారు. మోదీ రాక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని సభకు 70 వేల మంది హాజరవుతారని అంచనా వేశారు.

                                       

About Author